ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో వచ్చిన జనతాగ్యారేజ్ మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ కలిసి రెండోసారి పాన్ ఇండియా ప్రాజెక్టుతో వస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. తారక్ చేస్తున్న ఆర్ఆర్ఆర్, కొరటాల చేస్తున్న ఆచార్య పూర్తి కాగానే..ఆగస్టు నుంచి ఈ ప్రాజెక్టును మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రెండు కీ అప్ డేట్స్ బయటకు వచ్చాయి.
ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సంపత్ రాజ్ ను కీలక పాత్ర కోసం తీసుకున్నారట. అంతేకాదు పాపులర్ బాలీవుడ్ నటుడు కూడా ఈ మూవీలో జాయిన్ కాబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. కొరటాల శివ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ను ఇప్పటికే రెడీ చేశాడట. కైరా అద్వానీ ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుందని టాక్ నడస్తోంది. అయితే హీరోయిన్ ఎవరనేది దానిపై అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. మిక్కిలినేని సుధాకర్-నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును తెరకెక్కస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
కొత్తింట్లోకి ‘రాఖీభాయ్’..ఫొటోలు వైరల్
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్
ప్రభాస్ టు సాయిపల్లవి..సౌతిండియా స్టార్లు ఏం చదివారో తెలుసా..?
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్