నేను శైలజ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కీర్తి సురేష్ మహానటి సినిమాతో పాపులర్ యాక్ట్రెస్గా మారింది. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్లో ఇప్పటికే జాయిన్ అయిన కీర్తి దుబాయ్లో జరిగిన కొన్ని సన్నివేశాలలో పాల్గొంది.ప్రస్తుతం లాక్డౌన్ వలన ఇంటికే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ ఆరోగ్యంపై పూర్తి దృష్టి పెడుంది.
రీసెంట్గా తన సోషల్ మీడియా పేజ్లో యోగా ఆసనాలకు సంబంధించిన ఫొటోలు షేర్ చేసింది. ఇవి చూసి నెటిజన్స్ షాక్ అయ్యారు. ఇంతగా బక్కచిక్కావేంటి అని కామెంట్స్ పెట్టారు. ఇక తాజాగా చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోకరోనా టీకా తొలి డోసు తీసుకోగా, ఆ ఫోటోని కీర్తి సురేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరింది.