భోపాల్: కరోనాతో మరణించిన ఇద్దరు మహిళల మృతదేహాలు ఆసుపత్రిలో తారుమారయ్యాయి. దీంతో ముస్లిం మహిళ మృతదేహానికి హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో గురువారం ఈ ఘటన జరిగింది. కరోనా సోకిన ఇద్దరు మహిళలు భోపాల్లోని హమీదియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. వీరిలో ఒకరు ముస్లిం మహిళ కాగా మరొకరు హిందూ మహిళ.
నిబంధనల ప్రకారం కరోనాతో మరణించిన వారి మృతదేహాలను ముఖంతో సహా అంతా కప్పి ఉంచుతారు. వారిని గుర్తించేందుకు ఒక ట్యాగ్ వేలాడదీస్తారు. అయితే మరణించిన హిందూ మహిళ బంధువులు పేరు ట్యాగ్ను చూసుకోకుండా ముస్లిం మహిళ మృతదేహాన్ని తీసుకెళ్లారు. అనంతరం హిందూ ఆచారం ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించారు. మృతదేహాలు తారుమైన సంగతి ఆ తర్వాత వారికి తెలిసిందని ఆసుపత్రి అధికారి తెలిపారు