కొన్నేళ్ల క్రితం వచ్చిన తొలి ప్రేమ చిత్రం ఎందరికో మధురానుభూతులు మిగిల్చింది. ఇందులో కథానాయికగా నటించి అలరించిన కీర్తి రెడ్డి మెల్లగా ఇండస్ట్రీకి దూరమైంది. 2004లో హీరో సుమంత్తో వివాహం జరగ్గా 2006లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత బిజినెస్ మెన్ను వివాహం చేసుకొని బెంగళూరులో స్థిరపడింది. అయితే రీసెంట్గా ఆమె తండ్రి టీఆర్ఎస్ నాయకుడు కేశ్పల్లి (గడ్డం) ఆనందరెడ్డి(60) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. తండ్రి మరణ వార్త తెలుసుకొని కీర్తి రెడ్డి హుటాహుటిన హైదరాబాద్కు వచ్చినట్టు తెలుస్తుంది. ఆనంద్ రెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2018 ఎన్నికల ముందు టీఆర్ఎస్లో చేరిన ఆయన మొదట్లోయూత్ లీడర్గా పని చేశారు.