బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో సెప్టెంబర్ 5 నుండి సీజన్ 5 జరుపుకుంటుంది. 19 మంది కంటెస్టెంట్స్తో ఈ సీజన్ మొదలు కాగా, తొలి వారంలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో కాజల్, హమీదా, జెస్సీ, రవి, మానస్, సరయూలు డేంజర్ జోన్లో ఉన్నారు.
అయితే నామినేషన్ ప్రక్రియలో భాగంగా విశ్వ.. జస్వంత్ల మధ్య చిన్నాపాటి డిస్కషన్గా తనని తప్పుగా అర్ధం చేసుకున్నందుకు జస్వంత్ కన్నీరు పెట్టుకున్నాడు.ఆయనని తోటి కంటెస్టెంట్స్ ఓదార్చారు. ఎంతో మంది మోడల్స్గా తీర్చిదిద్దిన నువ్వు అలా ఏడవడం బాగోలేదు అంటూ కొందరు కంటెస్టెంట్స్ ఆయనకు సపోర్ట్గా నిలిచారు. అయితే బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ కూడా తోటి మోడల్కి తనవంతు సపోర్ట్ అందించారు.
కౌశల్ కూడా మోడల్ కాగా,ఆయన వన్ సైడ్గా నిలిచి టైటిల్ గెలుపొందారు. కౌశల్ తర్వాత మోడల్ అయిన అలీ రెజా బిగ్ బాస్ హౌజ్లో బానే సందడి చేశారు. ఇక ఇప్పుడు సీజన్ 5లో మోడలింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి జస్వంత్ వచ్చారు. ఈ క్రమంలో ఆయనను ఉద్దేశించి కౌశల్ పోస్ట్ పెట్టారు. నా తర్వాత , అలీ తర్వాత మోడలింగ్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది నువ్వని, మోడల్స్ కన్నీళ్లు పెట్టకూడదు అని చెప్పాడు. తమ యాటిట్యూడ్ లో ప్రేమని గెలుచుకోవాలి అన్నట్టుగా తెలిపాడు.. అంతే కాకుండా అలా ఏడిస్తే మొదటగా హౌస్ నుంచి ముందు నువ్వే బయటకి వచ్చేస్తావ్ సో జాగ్రత్తగా ఆడాలని ఆల్ ది బెస్ట్ చెప్పాడు.