పలాస 1978 చిత్రంతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు కరుణ కుమార్. ఈ సినిమా పలాసాలో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. సాంగ్స్కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చాయి. అయితే ప్రస్తుతం సుధీర్ బాబు కథానాయకుడిగా శ్రీదేవి సోడా సెంటర్
అనే మాస్ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గోదారి నేపథ్యంలో ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. హ్యూమర్ అండ్ కామెడీ నేపథ్యంలో సినిమా తీయబోతున్నట్టు కరుణ కుమార్ తెలియజేశాడు.
కరుణ కుమార్ ఇప్పటికే మొత్తం 8 కథలు రెడీ చేసుకుని వరుస సినిమాల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్ బాబుతో శ్రీదేవి సోడా సెంటర్ సినిమా చిత్రీకరణ పూర్తవుతోంది. తదుపరి గీతా ఆర్ట్స్ లోనూ ఓ సినిమా చేయనున్నారు. పలాస చిత్రం ఇంకా థియేటర్లలోకి రాకముందే కరుణ తన రెండవ చిత్రానికి అల్లు అరవింద్ నుంచి అడ్వాన్స్ అందుకోవడం ఆసక్తికరం. అనేక బ్లాక్ బస్టర్స్ ,కొన్ని ఫ్లాప్ చిత్రాలకు ఘోస్ట్ గా కథలు రాసిన కరుణ కుమార్.. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రంతో రచయితగా తన మొదటి క్రెడిట్ పొందారు.