యువ హీరో కార్తికేయ జోరుమీదున్నారు. విలక్షణ కథాంశాలతో వరుసగా సినిమాల్ని అంగీకరిస్తున్నారు. తాజాగా ఆయన మరో ప్రయోగాత్మక చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. యూవీ క్రియేషన్స్ పతాకంపై రూపొందనున్న ఈ సినిమా ద్వారా ప్రశాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నట్లు సమాచారం. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా మాస్ పాత్రలో కార్తికేయ కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో కార్తికేయకు జోడీగా ‘చిలసౌ’ ఫేమ్ రుహానీ శర్మ కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలిసింది.