బాలీవుడ్ బెబో కరీనా కపూర్ రీసెంట్గా 41వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఆమెకు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, పలువురు స్నేహితులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.ఇక సైఫ్ అలీ ఖాన్ తన భార్య కరీనా బర్త్డేని గ్రాండ్గా ప్లాన్ చేశాడు. తాజాగా కరీనా తన ఇన్స్టాగ్రాములో ఓ ఫొటో షేర్ చేసింది. ఈ ఫొటో తెగ వైరల్ అయింది.
బీచ్ లో సముద్రపు ఒడ్డున అత్యంత బ్యూటీఫిల్ లొకేషన్ లో కరీనా కపూర్ బర్త్ డే చాలా స్పెషల్ గా చేసుకుందని ఈ ఫొటో చూస్తుంటేనే అర్థం అవుతోంది. ఇద్దరు కొడుకులు మరియు భర్త సైఫ్ అలీ ఖాన్ లు బీచ్లో సరదాగా గడిపారు. నీటితో పాటు మంటను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మంటతో హ్యాపీ బర్త్ డే అంటూ అక్షరాలను ఏర్పాటు చేయడం ద్వారా ఈ బర్త్ డే చాలా స్పెషల్ అని తెలుస్తుంది.
41వ బర్త్ డే వేడుక ను కరీనా తన భర్త సైఫ్ అలీ ఖాన్ మరియు కొడుకులు తైమూర్ , జెహ్ లతో ఒక ద్వీపం లో చేసుకుంది. ఈ ప్రత్యేక బర్త్ డే వేడుక తో కరీనా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. రెండవ బిడ్డకు జన్మను ఇచ్చిన తర్వాత కరీనా కపూర్ ఖాన్ మళ్లీ నటించేందుకు సిద్దం అయ్యింది.