ప్రస్తుతం బాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్టుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రామాయణంలో సీత పాత్రను లీడ్ గా తీసుకుని ఓ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ సిద్దం చేసినట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ సీత పాత్రలో నటించబోతున్నట్టు బీటౌన్ వర్గాల టాక్. అయితే కరీనా ఈ సినిమా కోసం పెద్ద మొత్తంలో అంటే రూ.12 కోట్లు రెమ్యునరేషన్ అడిగిందని న్యూస్ లైమ్ లైట్ లోకి వచ్చింది.
తాజా అప్ డేట్ ప్రకారం సీత ప్రాజెక్టు కోసం కరీనా కనీసం 10 నెలలైనా కేటాయించాల్సి ఉంటుందట. దీంతో ఈ సినిమాకు డేట్స్ ఇవ్వాలంటే అడిగినంత పారితోషికం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మేకర్స్ కూడా కరీనాకు అంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సిద్దమయ్యారట. కరీనా కపూర్ ప్రస్తుతం అమీర్ఖాన్ తో లాల్ సింగ్ చధాతోపాటు వీరే ది వెడ్డింగ్ 2 సినిమాలు చేస్తోంది. దంగల్ ఫేం నితేశ్ తివారీ డైరెక్ట్ చేయనుండగా మధు మంతెన నిర్మించనున్నాడు. మహేశ్ బాబు రాముడిగా, హృతిక్ రోషన్ రావణుడిగా కనిపించబోతున్నట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి..
మరో యువ హీరో దగ్గరికి నితిన్ కథ..!
ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు!
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్సాబ్ డైరెక్టర్ తో నాని..!
యువ హీరోను లాక్ చేసిన మారుతి..!
డబ్బింగ్ స్టూడియో వద్ద అమీర్ఖాన్..ఫొటోలు వైరల్
పవన్-హరీష్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
స్టన్నింగ్ స్టిల్స్ తో జాన్వీకపూర్ పర్యావరణ సందేశం
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!