ఒకప్పుడు కథానాయికలు చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టడం చాలా అరుదుగా జరిగేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. నాయికలు కేవలం నటనకు మాత్రమే పరిమితమైపోకుండా తమ అభిరుచులను ప్రతిబింబించే కథాంశాల్ని ఎంచుకుంటూ సినీ నిర్మాణంలోకి ప్రవేశిస్తున్నారు. ఇప్పటికే హిందీ చిత్రసీమలో పలువురు అగ్ర కథానాయికలు ప్రొడక్షన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఆ జాబితాలోకి కరీనాకపూర్ చేరింది. హన్సల్మెహతా దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించబోతున్నది. ‘నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో ఈ సినిమాను తీయబోతున్నాం. కథ మొత్తం ఇంగ్లాండ్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. 21ఏళ్లుగా నేను నటిగానే మీకు పరిచయం. నిర్మాతగా ఈ కొత్త ప్రయాణాన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా’ అని కరీనాకపూర్ పేర్కొంది. ఈ సినిమాలో ఆమె ప్రధాన పాత్రలో నటించనుంది. ఏక్తాకపూర్ సహనిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమాను ఈ ఏడాది చివరలో సెట్స్మీదకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.