హైదరాబాద్ : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్- సుక్మా జిల్లాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో జవాన్ల మృతిపై రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. నక్సల్స్ దాడిలో అమరులైన జవాన్ల మృతిపట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. ఛత్తీస్గఢ్లో శనివారం నక్సల్స్తో జరిగిన ఎన్కౌంటర్లో 22 మంది జవాన్లు అసువులు బాసిన ఘటన విషాదకరమన్నారు. జవాన్ల త్యాగాలు మరువలేనివన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో చోటుచేసుకోకుండా ఉండాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.