పెద్దశంకరంపేట ,ఏప్రిల్ 22: రైతులు పండించిన ప్రతి గింజ నూ కొనుగోలు చేస్తామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం పెద్దశంకరంపేటలో పీఏసీఎస్ కార్యాలయ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ లక్ష్మీరమేశ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు రాములు, ఎంపీటీసీలు వీణాసుభాశ్గౌడ్, స్వప్నరాజేశ్వర్, దామోదర్, తహసీల్దార్ చరణ్సింగ్, ఆర్ఐ ప్రభాకర్, పీఏసీఎస్ సీఈవో రవీందర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
చివరి గింజ వరకూ కొనేలా చర్యలు ఎమ్మెల్యే పద్మాదేవేంర్రెడ్డి
మెదక్ అర్బన్, ఏప్రిల్ 22: రైతులు పండించిన పంట చివరి గింజ వరకూ కొనేలా చర్యలు తీసుకున్నారని ఎమ్మెల్యే పద్మాదేవేంర్రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఔరంగాబాద్, అవుసులపల్లిలో కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని సూచించారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి , కౌన్సిలర్ కిశోర్, పీఎసీఎస్ చైర్మన్ హనుమంత్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు అంజాగౌడ్, టీఆర్ఎస్ నాయకులు కిష్టయ్య, రాజులు, యాదగిరి పాల్గొన్నారు.
మండల పరిధిలో …
పాపన్నపేట, ఏప్రిల్ 22: మండల పరిధిలోని అన్నారం, అబ్లాపూర్, కొడపాక, మిన్పూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతుల కోసమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 350 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో పాపన్నపేట సర్పంచ్ గురుమూర్తిగౌడ్, మిన్పూర్ సర్పంచ్ లింగారెడ్డి, కొత్తపల్లి రైతు సేవా సహకార సంఘం చైర్మన్ రమేశ్గుప్తా, బాలాగౌడ్, గౌస్, దుర్గయ్య, పాపన్నపేట మండల వ్యవసాయశాఖ అధికారి ,నాయకులు పాల్గొన్నారు.