టాలీవుడ్లో మరో మలయాళ మూవీ రీమేక్ అవుతోంది. అయ్యప్పనమ్ కోషియుమ్ సినిమాను పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో రీమేక్ చేస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ మరో మలయాళ సినిమాను రీమేక్ చేస్తుంది. ఆ సినిమానే కప్పేలా. హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు.
లాక్డౌన్ కారణంగా నెట్ఫ్లిక్స్లో విడుదలైన కప్పేలా సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. తెలుగువారికి కూడా ఈ సినిమా బాగానే నచ్చింది. టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కూడా ఈ సినిమా తనకెంతగానో నచ్చిందని ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని భావించిన సితార ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా రైట్స్ను కొనుగోలు చేసింది. ఇద్దరు యువ హీరోలతో తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేస్తుంది. కృష్ణ అండ్ ఈజ్ లీలా ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ ఒక హీరో కాగా.. ఖైదీ, మాస్టర్ సినిమాల్లో విలన్ రోల్లో నటించిన అర్జున్ దాస్ మరో హీరోగా నటిస్తున్నారు. కథానాయిక మాత్రం ఇంకా కన్ఫార్మ్ కాలేదు. ఈ సినిమాతో శౌరి చంద్రశేఖర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఆగస్టులో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు.
ఇదే సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై మలయాళ చిత్రం అయ్యప్పనమ్ కోషియమ్ రీమేక్ అవుతుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇదే బ్యానర్పై ఇప్పటికే రీమేక్ అయిన ప్రేమమ్ సినిమా ఘన విజయం సాధించింది. ఇదిలా ఉంటే మలయాళంలో సూపర్ హిట్గా నిలిచిన లూసిఫర్ సినిమా రీమేక్ హక్కులను రామ్ చరణ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి ప్రధాన పాత్రలో ఈ సినిమా రీమేక్ కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఖుష్బూను ఆ టాలీవుడ్ హీరో కమిట్మెంట్ అడిగాడంట..!
హైదరాబాద్ అమ్మాయితో ఆమీర్ఖాన్ ఎఫైర్.. విడాకులు అందుకేనా?
రీమేక్లపై కన్నేసిన బాలీవుడ్.. పరాయి కథలతోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు
బిగ్ బాస్ 5 తెలుగులో ఆలీ ఎంట్రీ.. నిజమెంత?
విడుదలైన రెండేళ్ల తర్వాత ఖైదీ సినిమాపై కాపీ మరక