జనగామ చౌరస్తా, ఏప్రిల్ 4 : తైక్వాండో పోటీల్లో యువత రాణించి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ఒలింపిక్స్ క్రీడల్లో అర్హత సాధించాలని ఫిట్ ఇండియా ఫౌండేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ రాజమౌళి అన్నారు. తైక్వాండో జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో స్థానిక విజయ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు మెడల్స్తో పాటు ప్రశంసాపత్రాలను అందజేశారు. ముగింపు సభలో డాక్టర్ రాజమౌళి మాట్లాడుతూ తైక్వాండో మాస్టర్ లార్డ్స్ ఒలింపిక్ గేమ్ను విద్యార్థులు నేర్చుకుని రాణించాలని కోరారు. డాక్టర్ పవర్ భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు తన వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫిట్ ఇండియా ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు మోర్తాల ప్రభాకర్, మైబాద్ రమేశ్, తైక్వాండో మాస్టర్లు జీ యాదగిరి, ఎండీ అబ్బాస్, వీ పావని, సీహెచ్ అనూష, శాడ పోచయ్య, గంగరబోయిన ఫణీంద్ర పాల్గొన్నారు.
ఇవి కూడా చూడండి..
హిద్మా ఉన్నట్లుగా ట్రాప్.. మాటు వేసి మావోయిస్టుల దాడి
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు భగవతి సింగ్ మృతి