న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఐదు నెలల చిన్నారిని కబళించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. దీంతో ఆ పాప కుటుంబం కన్నీరుమున్నీరవుతున్నది. పరికి బాగా జ్వరంగా ఉండటంతో తల్లిదండ్రులు తొలుత దిల్షాద్ గార్డెన్లోని పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం చాచా నెహ్రూ పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లగా పాపకు కరోనా సోకినట్లుగా నిర్దారణ అయ్యిందని పరి తండ్రి తెలిపారు. దీంతో జీబీటీ ఆసుపత్రికి రిఫర్ చేశారని, అక్కడ మే 6 నుంచి వెంటిలేటర్పై ఉన్న తమ చిన్నారి ఈ నెల 12న చనిపోయిందన్నారు. పాప మృతదేహాన్ని సీమాపురి శ్మశానవాటికలో దహనం చేసినట్లు పరి తండ్రి వెల్లడించారు.