నార్కట్పల్లి, ఏప్రిల్ 24: వృద్ధులకు ఆసరా పింఛన్లు అందిస్తూ అండగా ఉంటున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తూ నల్లగొండ జిల్లా నార్కట్పల్లి చెందిన గూడూరు నాగమ్మ శనివారం రామకోటి రాయం మొదలుపెట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నదని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం వల్ల వారంతా ఆనందంగా ఉన్నారని పేర్కొంది. కేసీఆర్, కేటీఆర్ నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతున్ని కోరుతూ రామకోటి రాస్తున్నట్టు తెలిపింది.