బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇటీవలి కాలంలో వివాదాలతో వార్తలలో నిలుస్తూ ఉంటుంది. ఇటీవల తలైవి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కంగనా రనౌత్.. తాజాగా కోర్టు పని తీరుని తప్పు పట్టింది. కోర్టు కూడా బెదిరిస్తుందని, దానిపై నమ్మకం పొయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
సుశాంత్ సింగ్ మరణించిన సమయంలో నెపోటిజంపై కంగనా తీవ్ర విమర్శలు చేసింది. హృతిక్ రోషన్, రైటర్ జావెద్ అక్తర్లను ఉద్దేశిస్తూ ‘బాలీవుడ్లో కోటరీ వ్యవస్థ చాలా బలంగా నాటుకుపోయింది’ అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీనిపై రైటర్ జావెద్ అక్తర్ కంగనా రనౌత్పై పరువు నష్టం దావా వేశారు.
ఈ కేసుకి సంబంధించి హాజరుకావాలంటూ ముంబైలోని అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కంగనకు ఫిబ్రవరి నుంచి పలుమార్లు సమన్లు జారీచేశారు. ఎట్టకేలకు కంగనా హాజరైంది. బెయిల్ వచ్చే అవకాశం ఉన్నా, ఇవ్వకుండా కోర్టుకి హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తామని పరోక్షంగా కోర్టు రెండు సార్లు తనను బెదిరించిందని తెలిపారు కంగనా.
ఈ కేసు దర్యాప్తు తనకు వ్యతిరేఖంగా సాగుతుందని చెప్పిన కంగనా, ఈ కేసుని మరోకోర్టుకి బదలాయించాలని చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ ముందు రిక్వెస్ట్ చేశారు. ఈ దరఖాస్తును అక్టోబర్ 1న కోర్టు పరిశీలించనుంది.