సునీల్, సుక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కనబడుటలేదు’. బాలరాజు.ఎం దర్శకుడు. సాగర్ మంచనూరు, సతీష్రాజు, దిలీప్, శ్రీనివాస్కిషన్, దేవీప్రసాద్ నిర్మించారు. ఈ నెల 13న విడుదలకానుంది. శనివారం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు రామ్గోపాల్వర్మ, రచయిత విజయేంద్రప్రసాద్ ముఖ్య అతిథుతులుగా హాజరై బిగ్ టికెట్ను విడుదలచేశారు. చిత్రదర్శకుడు మాట్లాడుతూ ‘క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. వరుస హత్యలకు పాల్పడుతున్న కిల్లర్ను తన తెలివితేటలతో ఓ డిటెక్టివ్ ఎలా పట్టుకున్నాడన్నది ఉత్కంఠభరితంగా ఉంటుంది’ అన్నారు. ‘టైటిల్ బాగుంది. అనుభవజ్ఞుడైన దర్శకుడిగా బాలరాజు ఈ సినిమాను తెరకెక్కించారు’ అని రామ్గోపాల్వర్మ చెప్పారు.