నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఏకపక్షంగా విజయం సాధిస్తుందని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే బీజేపీ చతికిలపడిందని, ప్రజలకు కాంగ్రెస్పై నమ్మకం లేదని, టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవబోతున్నదని ధీమ ఆ వ్యక్తం చేశారు. ఇటీవల పట్టభద్రుల నియోజకవర్గంలో టీఆర్ఎస్ రెండింటికి రెండు స్థానాలను గెలుచుకున్నదని గుర్తుచేశారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్సే విజయం సాధిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని.. ఆ పార్టీ నేతలు టీఆర్ఎస్ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు
ఇవీ కూడా చదవండి
40 అడుగుల ఎత్తులో.. సైకిల్ సవారీ
బడిపిల్లలు.. విజ్ఞానంలో మెరికలు