గత ఏడాదికాలంగా రాజకీయాలతో బిజీగా గడిపిన కమల్హాసన్ తిరిగి సినిమాలపై దృష్టిసారించారు. ప్రస్తుతం ‘ఇండియన్-2’, ‘విక్రమ్’ సినిమాల్లో నటిస్తున్న ఆయన తాజాగా మరో చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. కాకాముైట్టె, విశారణై, అసురన్ చిత్రాలతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు వెట్రిమారన్. సామాజిక ఇతివృత్తాలకు పెద్దపీట వేస్తూ సినిమాల్ని తెరకెక్కించే ఈ దర్శకుడు ఇటీవలే కమల్హాసన్కు ఓ కథను వినిపించినట్లు సమాచారం. తమిళంలో ప్రసిద్ధి పొందిన ఓ నవల ఆధారంగా దర్శకుడు సిద్ధంచేసిన కథలోని కొత్తదనం నచ్చడంతో కమల్హాసన్ ఈ సినిమాను అంగీకరించినట్లు తెలిసింది. దాదాపు వంద కోట్ల భారీ వ్యయంతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలిసింది.