ఇండోర్: మహిళా ఫిల్మ్మేకర్లను ప్రోత్సహించేందుకు ఈసారి కళాకారి ఫిల్మ్ ఫెస్టివల్ను నిర్వహించనున్నారు. కెమెరా కన్నుల వెనుక దాగి ఉన్న మహిళా ట్యాలెంట్ను పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈ సారి మహిళ ఫిల్మ్మేకర్లకు పెద్దపీట వేయనున్నారు. ఆరవ ఎడిషన్ ఫిల్మ్ ఫెస్టివల్లో మహిళలు తీసిన, మహిళలకు సంబంధించిన 500 చిత్రాలకు సపోర్ట్ ఇవ్వనున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన రిశీ నికమ్ కళాకారి ఫిల్మ్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నాడు. మహిళా ఫిల్మ్మేకర్లకు సపోర్ట్ ఇవ్వడమే ఆయన ఉద్దేశం. చిత్రోత్సవంలో 500 సినిమాలను ప్రదర్శించనున్నారు. వివిధ భారతీయ భాషల్లో మహిళలు తీసిన సినిమాలను ప్రదర్శిస్తారు. సినీ నిర్మాణంలో లింగ వివక్ష ఉండకూడదని కళాకారి నికమ్ తెలిపారు. ప్రపంచ స్థాయిలో భారతీయ మహిళలు తమ ట్యాలెంట్ను చూపిస్తారన్న ఉద్దేశంతో ఫిల్మ్ ఫెస్టివల్ను ఆర్గనైజ్ చేస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి చిత్రోత్సవాలతో మహిళా ఫిల్మ్మేకర్లకు గౌరవం పెరుగుతుందన్నారు. వివిధ దేశాలకు చెందిన మహిళలు కూడా తమ ఫిల్మ్ నైపుణ్యాన్ని ప్రదర్శించన్నారు. ఫిబ్రవరిలో జరిగే ఈ ఈవెంట్ కోసం ఆసక్తికలవారు దరఖాస్తు చేసుకోవాలి. https://www.rishinikam-kalakari.com అనే ఈ లింక్ను ఓపెన్ చేయండి.