పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ పచ్చదనం పెంచాలనే స్ఫూర్తిని ప్రజల్లో కలిగిస్తున్నారు. సోమవారం సంగీత దర్శకుడు కాలభైరవ, యువ హీరో శ్రీసింహా ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో పాల్గొన్నారు. ఫిలింనగర్ రామానాయుడు స్టూడియోలో మొక్కలు నాటారు.
అనంతరం వారు మాట్లాడుతూ…‘నాయిక రెజీనా ఇచ్చిన గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించాం. ఎన్ని మొక్కలు నాటితే పర్యావరణానికి అంత మేలు జరుగుతుంది. ప్రకృతి బాగుంటే మానవాళి బాగున్నట్లే. ప్రముఖుల నుంచి సామాన్యుల దాకా ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొనేలా స్ఫూర్తి నింపుతున్న ఎంపీ సంతోష్ గారికి కృతజ్ఞతలు’. అన్నారు. అనంతరం కాలభైరవ, శ్రీసింహా దర్శకుడు సందీప్రాజ్, అశ్విన్ గంగరాజుకు ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ విసిరారు.