బడంగ్పేట,మార్చి9: మహిళా సాధికారతకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మైత్రీపురంలో మహిళా మండలి ఆధ్వర్యంలో మంగళవారం మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలను పంచి పెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్,రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజక వర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవిని గెలిపించాలని మహిళలకు విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ మహిళల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడటానికి పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తున్నారన్నారు. స్మాల్ఇండస్ట్రీలను ఏర్పాటు చేయించారని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. టీఆర్ఎస్ ప్ర భుత్వం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని పేర్కొన్నారు. మార్కెట్ కమిటీలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డి ప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్లు సిద్దాల లావణ్య బీరప్ప, అర్కల భూపాల్రెడ్డి, టీఆర్ఎస్ మ హిళా విభాగం మహేశ్వరం నియోజక వర్గం అధ్యక్షురాలు బండి మీనా, టీఆర్ఎస్ మీర్పేట వర్కింగ్ ప్రెసిడెంట్ అర్కల కామేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రక్షణ శాఖను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయనున్నదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బాలాపూర్ చౌరస్తాలోని ఆనంద్ ఫంక్షన్ హాల్లో బీడీఎల్ ఉద్యోగుల సమావేశం కర్రె బల్వంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డిఫెన్స్ ఉద్యోగులు ఆలోచన చేయవలసిన అవసరం ఉందన్నారు. పబ్లిక్ రంగాలను ప్రైవేట్ పరం చేయనున్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఏడాదికి రెండు వందల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిందని, ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని కోరారు. ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, రైల్వే, ఎయిర్ ఇండియా తదితర సంస్థలను త్వరలో ప్రైవేట్ పరం చేయనున్నారని పేర్కొన్నారు. గతంలో ఎమ్మెల్సీగా గెలిచిన రాంచందర్రావు ఏం చేశాడో చెప్పాలన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోని వారికి ఓట్లు వేస్తే ప్రయోజనం లేదన్నారు. విద్యావంతులురాలు, ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన సురభి వాణీదేవిని గెలిపిస్తే సమస్యలను పరిష్కరించడానికి అవకాశం ఉంటుందన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలించాలన్నారు. కార్యక్రమంలో ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.