న్యూఢిల్లీ : ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్ వద్ద అనుమానాస్పద వస్తువును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు డాగ్, బాంబు స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ.. నేషనల్ మీడియా సెంటర్ వద్ద అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో సీఐఎస్ఎఫ్, డాగ్, బాంబు స్క్వాడ్ బృందాలు అక్కడికి వెళ్లి తనిఖీలు చేశాయన్నారు. తనిఖీల్లో ఎలాంటి బాంబులు, పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని, పాలిథీన్ కవర్లో చుట్టిన ప్లాస్టిక్ బొమ్మ లభ్యమైందని పోలీసులు తెలిపారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.