కోల్కతాలోని గంగాతీరంలో చేసిన పడవ ప్రయాణం జీవితకాలపు అనుభూతినిచ్చిందని కాజల్ అగర్వాల్ ఆనందం వ్యక్తం చేసింది. తనకు విహారాలు కొత్తేమి కాకపోయినా పవిత్ర గంగా నదిలో ప్రయాణం ఎన్నో జ్ఞాపకాల్ని మిగిల్చిందని చెప్పింది. ప్రస్తుతం ఈ పంజాబీ సోయగం మహిళా ప్రధాన కథాంశంతో రూపొందుతున్న ‘ఉమ’ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నది. కోల్కతాలో జరుగుతున్న షెడ్యూల్కు సంబంధించిన ఫొటోల్ని కాజల్ అగర్వాల్ ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకుంది. షూటింగ్ లోకేషన్కు తన కుటుంబ సభ్యులను ఆహ్వానించి వారితో తీయించుకున్న ఫొటోల్ని కూడా షేర్ చేసింది. అన్నింటికంటే ముఖ్యంగా గంగా ఘాట్లో చేసిన పడవ ప్రయాణం ఎంతో ప్రత్యేకమని పేర్కొంది. ‘గంగా జలాల స్వచ్ఛత, ప్రవాహపు అద్భుత దృశ్యం నయనానందకరంగా అనిపిస్తోంది. నింగిలోని మేఘాల పరుగులు నదికి కొత్త శోభను తీసుకొచ్చాయి. నీ చెంతకు చేరిన వారి పాపాలను పరిహారం చేస్తూ ఇంత ప్రశాంతంగా సాగిపోవడం పరమాద్భుతం. నీకంటే గొప్ప నిజం లేదు’ అంటూ కాజల్ అగర్వాల్ కవితాత్మకంగా తన భావాల్ని వ్యక్తం చేసింది.