బిగ్ బాస్ సీజన్ 5 తాజా ఎపిసోడ్లో ప్రియాంక.. మళ్లీ మానస్ని హర్ట్ చేసి ఆయన వలన కొంత డిస్ట్రబ్ అయింది. భయపడుకుంటేనే ఆయన దగ్గరకు వచ్చి నీతో మాట్లాడొచ్చా, తిట్టవు కదా అని అడిగింది. అందుకు మానస్.. తిట్టనులే ఏంటో చెప్పు అన్నాడు. దీంతో టాస్క్ల్లో నేను వందశాతం ఎఫర్ట్ ఇస్తున్నానా? అని అడిగింది. హా ఇస్తున్నావ్ గా అని చెప్పాడు మానస్.
ఇక నువ్వు పెట్టిన బార్డర్ని నేను ఎప్పుడైన దాటానా అని ప్రియాంక అడగగా, అదేంలేదు అని అన్నాడు మానస్.అయిన ఇదే ప్రశ్న ఎన్ని సార్లు అడుగుతావు. నేను బార్డర్ ఎందుకు పెడతా అంటే.. ఎదుటి వాళ్లు హర్ట్ అవుతారని.. ప్రతి ఒక్క రిలేషన్లోనూ అంచనాలు ఉంటాయి.. అది వాళ్లు రీచ్ కాలేకపోతే ఫీల్ అయిపోయినట్టు కాకుండా మంచి ఒపీనియన్ ఉండాలనే బార్డర్ పెడతా. ఈ ప్రశ్న పదేపదే అడిగి ఇబ్బంది పెట్టకు అని అన్నాడు మానస్.
మానస్ మాటలకు హర్ట్ అయిన ప్రియాంక కన్నీరు పెట్టుకుంది. ఇక కాజల్ కెప్టెన్సీ టాస్క్లో తనకు పోటీ ఉండకూడదని భావించి గతంలో చెక్ చేసి ఓకే చెప్పిన రవి టీం బొమ్మలను మళ్లీ పరిశీలించాలని అనుకున్నట్టు చెప్పింది. సంచాలకులు చెప్పింది తప్పక వినాలి కాబట్టి వాళ్లు మళ్లీ తెచ్చారు. అయితే ఇందులో కొన్నిబొమ్మలను కాజల్ రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.