రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేశ్కుమార్
వనపర్తి రూరల్, మార్చి 30 : జిల్లాలో యాసంగిలోని ధాన్యాన్ని సేకరించేందుకు కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేశ్కుమార్ కలెక్టర్ షేక్యాస్మిన్ బాషాను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించి న వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ యాసంగిలో కూడా ధా న్యం విరివిగా మార్కెట్కు వచ్చే అవకాశముందని, కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ధాన్యం కొ నుగోలు చేయుటకు అన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. అలాగే ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామ పంచాయతీలో వంద మంది కూలీలకు ఉపాధి క ల్పించాలన్నారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతిలో చేపట్టిన వైకుంఠ ధామాలు, రైతు వేదికలు, రైతు కల్లాలను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. హరితహారంలో భాగంగా న ర్సరీల లక్ష్యాలను సాధించాలని, ఈ రెండు మాసాలు నర్సరీల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, జిల్లా కేం ద్రంలో రహదారుల వెంట మూడు వరుసల్లో మొక్కలు రోడ్డుకిరువైపులా నాటాలన్నారు. రెండో దశ కరోనా వ్యాప్తిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ మాస్కు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలన్నారు. ఈ వీసీలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డీఎంహెచ్వో శ్రీనివాసు లు, డీఆర్డీవో పీడీ కోదండరాములు పాల్గొన్నారు.