జెనీవా: కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న విషయం తెలిసిందే. ఆ మహమ్మారి వల్ల గత ఏడాది కాలంలో లక్షలాది మంది ప్రాణాలు విడిచారు. అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ కోవిడ్ డేటా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 35 లక్షల మంది మరణించారు. సుమారు 17 కోట్ల మందికి వైరస్ సంక్రమించింది. అమెరికాలో 33.0 లక్షల మందికి వైరస్ సోకగా.. 5.88 లక్షల మంది మరణించారు. ఇండియాలో 26 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 2.90 లక్షల మంది మరణించారు. బ్రెజిల్లో కూడా మరణాల సంఖ్య ఎక్కువగానే ఉన్నది. బ్రెజిల్లో 15 లక్షల మందికి వైరస్ సోకగా.. దాంట్లో 4.41 లక్షల మంది మరణించారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇవాళ ఓ ప్రకటన చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ వల్ల సంభవించిన మరణాల సంఖ్య .. అధికారిక లెక్కల కన్నా మూడు రెట్లు అధికంగా ఉంటుందని డబ్ల్యూహెచ్వో పేర్కొన్నది. అనేక ప్రపంచ దేశాలు ఇంకా ఆ మహమ్మారిపై పోరాటం చేస్తూనే ఉన్నాయి.