నాలుగురోజుల ఉత్కంఠకు తెర
ఎమ్మెల్సీగా వాణీదేవి అఖండ విజయం
మండలికి చదువులతల్లి
భారీ పోలింగ్తోనే విజయంపై ధీమా
సంబురాల్లో టీఆర్ఎస్ శ్రేణులు
వైషమ్యాలతో గెలవాలనుకున్న బీజేపీకి చుక్కలు చూపిన పట్టభద్రులు
మహబూబ్నగర్, మార్చి 20 (నమస్తే తె లంగాణ ప్రతినిధి) : విజయం మన ‘వాణి’దే. అవును వాణీదేవి విజయం మనదే. మన పా లమూరు వాసులందరిదీ అని చాటి చెప్పారు ఇక్కడి పట్టభద్రులు. ఉమ్మడి జిల్లాలోని 1,19,367 మంది పట్టభద్ర ఓటర్లలో 78.47 శాతం అంటే 92,772 మంది ఓటు హక్కు వి నియోగించుకున్నారు. ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలోనే అత్యధికంగా 80.86 శాతం ఓ టింగ్ జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి నమోదైంది. గతంలో ఎప్పుడూ లేనంత గా పట్టభద్రులు ఓటేసేందు కు రావడం ఈ ఎన్నికల్లో నే రికార్డు. ఆ విధంగా పాలమూరు పట్టభద్రులు ఎమ్మెల్సీగా వాణీదేవిని గెలిపించాలని బలంగా కోరుకున్నారని విశ్లేషకులు ముందే అంచనా వేశారు. అది అక్షరాలా నిజమైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆమె ఘన విజయం సాధించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సాగుతున్న అభివృద్ధిని గమనించిన పట్టభద్రులు ఎమ్మెల్సీగా వాణీదేవికి పట్టం కట్టారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని కల్వకుర్తి మండలం రఘుపతిపేటకు చెందిన వాణీదేవి గెలుపు కోసం ప్రతి ఒ క్కరూ కృషి చేశారు. స్థానికురాలని గెలిపించుకోవాలనే తపన అన్ని వర్గాల్లోనూ కనిపించింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఐక్యంగా టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించాయి. ఉన్నత ఉద్యోగం కోసం వివిధ ప్రాంతాల్లో ఉన్న పట్టభద్రులు సొంతూళ్లకు వచ్చి ఓటేశారు. ఫలితం వెలువడేందుకు నాలుగు రోజుల సుదీర్ఘ సమయం పట్టినా అద్భుతమైన గెలుపు సాధించడంతో పార్టీ శ్రేణులు విజయోత్సవాలు జరుపుకొంటున్నారు.
కొంత కాలంగా బీజేపీ నేతలు సీఎం కేసీఆర్, ప్ర భుత్వంపై వివిధ సందర్భాల్లో ప్రవర్తించిన తీరు.. వాడిన భాష మేధావులైన పట్టభద్రులను ఆలోచింపజేసింది. వారంతా వివేకంతో ఓటేసి తమ తీర్పు తో బీజేపీకి చుక్కలు చూపించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దుబ్బాకలో గెలుపు, జీహెచ్ఎంసీలో కొన్ని సీట్లతో వచ్చిన ఫలితాలే పునరావృ తం అవుతాయని మాట్లాడిన నేతలకు పట్టభద్రులు గట్టి సమాధానం ఇచ్చారు. ఓటు పోటుతో తెలంగా ణ శాసనమండలిలో బీజేపీని ఖాళీ చేశారు. ప్రజల మధ్య వైషమ్యాలతో గెలుపు సాధ్యం కాదని పట్టభద్రులు తేల్చి చెప్పారు. అభివృద్ధి, ప్రశాంత వాతావరణం కోరుకుంటున్న ప్రజలు అది టీఆర్ఎస్ వల్లే సాధ్యమని మరోసారి పట్టం కట్టి నిరూపించారు. తె లంగాణ కోసం కొట్లాడిన పార్టీ వల్లే రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తుందని పట్టభద్రులు బలంగా నమ్మిన ఫలితమే ఈ గెలుపుగా చర్చించుకుంటున్నారు.