శర్వానంద్, రష్మిక ప్రధాన పాత్రలలో కిషోర్ తిరుమల(Kishore tirumala) తెరకెక్కిస్తున్న చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు.శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ రాజమండ్రిలో మొదలైంది. ప్రధాన తారాగణంపై తెరకెక్కించనున్న ఈ సన్నివేశాలతో టాకీ పార్ట్ ముగియనుందని అంటున్నారు.
షూటింగ్లో పాల్గొన్న హీరో శర్వానంద్( sharwanand) , హీరోయిన్ రష్మిక(Rashmika) లకు సురుచి పీఆర్ఓ వర్మ అతి పెద్ద కాజాలను అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రం ‘కుటుంబ వినోదంతో కూడిన చిత్రమిది. శర్వానంద్ పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూ అలరిస్తాడు. రష్మిక మందన్న పాత్ర ఓ మంచి అనుభూతిని పంచుతుంది.
చిత్రంలో ఖుష్బూ, రాధిక శరత్కుమార్, ఊర్వశి, వెన్నెల కిశోర్, రవిశంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోపరాజు, బెనర్జీ, కల్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్యకృష్ణ, ఆర్సీఎమ్ రాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు.చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు నెటిజన్స్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Charmy Kaur | యాక్టింగ్లోకి రీఎంట్రీపై ఛార్మీ ఏమన్నదంటే..?
Rajinikanth | రేపు నాకు చాలా ప్రత్యేకమైన రోజు: ట్విటర్ లో రజినీకాంత్
Rakul Preet Singh | రకుల్ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం
Bigg Boss: హౌజ్మేట్స్తో పలు గేమ్స్ ఆడించిన నాగార్జున.. విజేతగా నిలిచిన అనీ మాస్టర్
Raja Babu: రాజబాబు కన్నుమూత.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు