పరకాల, మే21: కరోనా వైరస్ను అవగాహనతో నియంత్రించాలే తప్ప ఆందోళనకు గురికావొద్దని మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రధాన రహదారులు, బస్టాండ్, పోలీస్ స్టేషన్ ఆవరణలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈ సం దర్భంగా విజయపాల్రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిందని, ప్రతి ఒక్కరూ అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. కరోనా లక్షణాలు ఉన్నట్లయితే డాక్టర్ల సూచన మేరకు మందులు వాడుతూ హోం ఐసొలేషన్లో ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తిరునహరి శేషాంజన్ స్వామి, కౌన్సిలర్లు మడికొండ సంపత్ కుమార్, అడప రాము, ఏకు రాజు, టీఆర్ఎస్ నాయకులు పసుల రమేశ్, పాడి భగవాన్ రెడ్డి, సమ్మయ్య పాల్గొన్నారు.