వెండితెరపై విలక్షణ పాత్రలలో నటించి మెప్పించిన స్టార్ట్స్ని చాలా మందిని చూశాం. అయితే పిసినారి పాత్రలో మంచి వినోదం అందించిన స్టార్ ఎవరంటే అందరికి ఆహాన పెళ్లంట చిత్రంలోని కోట శ్రీనివాసరావు పాత్ర ఠక్కున గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఇలాంటి పాత్రతోనే ప్రేక్షకులని అలరించాలని యువ డైరెక్టర్ అనీల్ రావిపూడి భావిస్తున్నాడట. ఈ క్రమంలో ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్గా రూపొందిస్తున్న ఎఫ్ 3 చిత్రంలో రాజేంద్రప్రసాద్ని పిసినారిగా చూపించి ఫన్ అందించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది.
రాజేంద్ర ప్రసాద్ పాత్ర సినిమాకే హైలైట్గా ఉంటుందని టాక్. కరోనా సెకండ్ వేవ్ వలన ఆగిన చిత్ర షూటింగ్ మరి కొద్ది రోజులలో సారధి స్టూడియోలో ప్రారంభం కానుంది. డబ్బుల చుట్టూ నడిచే కామెడి డ్రామాగా అనీల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఇందులో తమన్నా, మెహరీన్లు కథానాయికలుగా నటిస్తున్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాదే ఎఫ్ 3 చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు.