గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు ఇవాళ ఒక యువతి హల్చల్ చేసింది. నిర్మాత బన్నీవాసు తనను వాడుకొని మోసం చేసి.. అవకాశం ఇవ్వలేదంటూ ఆరోపించింది. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
గతంలో సునీత బోయ అనే యువతి మలక్పేటలో పండ్ల వ్యాపారం చేసేది. అక్కడ ఆమెకు కొందరు సినీ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. దీన్ని ఆసరాగా తీసుకుని బన్నీ వాసు.. తనకు అవకాశం ఇస్తానని మోసం చేశాడంటూ కొద్దిరోజులుగా ఆరోపణలు చేస్తుంది. ఇదే విషయంపై నిర్మాత బన్నీవాసును బెదిరిస్తూ వస్తుంది. దీనిపై ఆయన పలుమార్లు పోలీసులను ఆశ్రయించాడు. తన పరువుకు భంగం వాటిల్లేలా సునీత ప్రవర్తిస్తుందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలో కూడా పలుమార్లు జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45లో ఉన్న గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లి రచ్చ చేసింది సునీత బోయ. అప్పట్లో ఈమెపై 4 ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి. వీటిలో రెండు కేసుల్లో జైలుకు వెళ్లగా.. మరో రెండు కేసుల్లో ఈమె మానసిక పరిస్థితి బాగోలేదంటూ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ కొన్ని రోజులు చికిత్స తీసుకుని బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్లీ అవే ఆరోపణలు చేసింది.
తనకు న్యాయం చేయకపోతే గీతా ఆర్ట్స్ ఆఫీసు ముందు ఆత్మహత్య చేసుకుంటానని జూన్లో మళ్లీ బెదిరించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేసింది. దీంతో ఆ కార్యాలయ మేనేజర్ అయ్యప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఆమె గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా.. సునీత మానసిక పరిస్థితి బాగోలేదని, ఆమెను మరోసారి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కు తరలించాలని ఆదేశించారు. దీనిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
రెండు నెలలుగా ఐసీయూలోనే హీరోయిన్ తనయుడు
అఖిల్ సినిమాలో మలయాళ స్టార్ మమ్ముట్టి.. నాగార్జునకు ఛాన్స్ మిస్
30 ఏళ్ల వ్యక్తిలా కనిపించేందుకు చాలా కష్టపడ్డా: ఫహద్ ఫాసిల్
ఇంత వరకు రీమేక్ల వైపు కన్నేయని మహేష్.. ఎందుకో తెలుసా?
ప్రశాంత్ నీల్.. నాలుగు నెలల్లో రెండు పాన్ ఇండియన్ సినిమాలు
ఇండస్ట్రీలోకి కోడిరామకృష్ణ కూతురు ఎంట్రీ..!