నిజామాబాద్ : పల్లె ప్రగతి విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులు, ప్రజాప్రతినిధులపై వేటు పడింది. పల్లె, పట్టణ ప్రగతి విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఆరుగురు గ్రామ కార్యదర్శులను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సస్పెండ్ చేశారు. నలుగురు సర్పంచులకు షోకాజ్ నోటీసుల జారీకి ఆదేశాలు ఇచ్చారు. బుధవారం కలెక్టరేట్ నుంచి డివిజనల్ పంచాయతీ అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ సహాయ ఇంజినీర్లు, డీఆర్డీఓ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామాల వారీగా సమీక్షించగా పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సర్పంచ్ ల నిర్లక్ష్యాన్ని గుర్తించి చర్యలకు ఆదేశించారు. అనధికారికంగా విధులకు గైర్హాజరైనందుకు నందిపేట మండలం ఐలాపూర్, వర్ని మండలం వకీల్ ఫారం గ్రామ కార్యదర్శులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా అవెన్యూ ప్లాంటేషన్ లో నిర్లక్ష్యానికి గాను డిచ్ పల్లి మండలం సాంపల్లి, సుద్ధపల్లి, ధర్పల్లి మండలం రామడుగు, ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డి పల్లి 4 గ్రామాల కార్యదర్శులను కూడా సస్పెండ్ చేశారు. అలాగే ఈ నాలుగు గ్రామాల సర్పంచులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
పల్లె ప్రకృతి వనాలు ప్రశాంతతకు నిలయాలు
దారుణం : టీనేజ్ సోదరిపై 12 ఏండ్ల బాలుడి లైంగిక దాడి
వెదజల్లే సాగుతో అధిక దిగుబడి : మంత్రి పువ్వాడ
రెండు, మూడు రోజుల్లోవాసాల మర్రికి సీఎం కేసీఆర్ రాక