విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలుక్రిస్టినా జడ్ చోంగ్తు
హన్మకొండ, ఏప్రిల్ 28 : పోలింగ్ నిర్వహణలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమని రాష్ట్ర ఎన్నికల పరిశీలికురాలు క్రిస్టినా జడ్ చోంగ్తు అ న్నారు. బుధవారం కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మం తు, నగర కమిషనర్ పమేలా సత్పతితో కలిసి హన్మకొండ హంటర్ రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్లో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిస్టినా మాట్లాడుతూ.. గ్రేటర్ పరిధిలోని 66 వార్డులకుగాను 878 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని 167 క్రిటికల్, 159 హైపర్ సెన్సిటివ్, 203 సెన్సిటివ్ కలిపి మొత్తం 529 కేంద్రాలను సామస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామన్నారు. ఆయా కేంద్రాల్లో సీసీ టీవీ, బీఎస్ఎంఎల్ ఫిజిబిలిటీ ఉన్న 46 కేంద్రాల్లో లైవ్ వెబ్కాస్టింగ్కు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మిగిలిన కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకుల పర్యవేక్షణలో మొత్తం పోలింగ్ ప్రక్రియ జరుగుతుందని ఆమె తెలిపారు. మైక్రో అబ్జర్వర్లు వారి విధులు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. పోలింగ్ రోజు ఉదయం 6గంటలకు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. రాష్ట్ర ఎ న్నికల సంఘం మార్గదర్శకాలను పోలింగ్ ఏజెం ట్లు పాటించేలా మైక్రో అబ్జర్వర్లు చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు గుర్తింపు కార్డులు కల్గిన ఏజెం ట్లు మాత్రమే రావాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కంపార్ట్మెంట్పై వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాలు ఉండకుండా చూడాలన్నారు. ప్రజలు పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా ఓ టు హక్కు వినయోగించుకొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ సమయంలో పొరపాట్లు జ రిగితే సూక్ష్మ పరిశీలకులు నేరుగా ఎన్నికల సాధారణ పరిశీలకులకు సమాచారం అందించాలన్నా రు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సు లు మూసివేసే ప్రక్రియ మైక్రో అబ్జర్వర్ల సమక్షం లో జరుగాలన్నారు. మైక్రో అబ్జర్వర్లు అందించే వివరాల ఆధారంగా రీ పోలింగ్, అలతస్వంగా వ్యవహరించే పోలింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
సజావుగా జరిగేలా చూడాలి..
పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా సూక్ష్మ పరిశీలకులు పర్యవేక్షించాలని, నివేదికలు సకాలంలో సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హ న్మంతు అన్నారు. పీవో, ఏపీవోలపై ఆధారపడకుండా ప్రతి పోలింగ్ ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. పోలిం గ్ వివరాలను సంబంధిత నమూనా ఫా రాల్లో రిసెప్షన్ కౌంటర్లో అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనీ లు, మైక్రో అబ్జర్వర్లు పాల్గొన్నారు.