Cinema
- Jan 22, 2021 , 14:58:10
VIDEOS
నో టైమ్ టు డై.. మళ్లీ వాయిదా

లాస్ ఏంజిల్స్ : జేమ్స్ బాండ్ సినిమా 'నో టైమ్ టు డై' మళ్లీ వాయిదా పడింది. కోవిడ్ వల్ల ఆ సినిమాను ఈ ఏడాది అక్టోబర్లో రిలీజ్ చేయనున్నారు. వాస్తవానికి గత ఏడాదే రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్కు వాయిదా వేశారు. అయితే కరోనా నుంచి ఇంకా థియేటర్లు కోలుకోలేదని, అందుకే ఆ మూవీని వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 8వ తేదీన 'నో టైమ్ టు డై'ని రిలీజ్ చేయనున్నారు. ఎంజీఎం, కామ్కాస్ట్ కార్ప్స్ యూనివర్సల్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాయి. గత ఏడాది ఏప్రిల్లో విడుదల కావాల్సిన ఈ సినిమాను మొదట నవంబర్కు వాయిదా వేశారు. కరోనా వల్ల మళ్లీ 2021 ఏప్రిల్కు వాయిదా వేశారు. సుమారు 200 మిలియన్ల డాలర్ల ఖర్చుతో సినిమాను రూపొందించారు. బ్రిటీష్ ఏజెంట్ పాత్రలో డానియల్ క్రేగ్ నటిస్తున్నాడు.
తాజావార్తలు
- రాష్ట్రంలో కొత్తగా 168 కరోనా కేసులు
- మోదీ ర్యాలీలో గంగూలీ.. ఆయన ఇష్టమన్న బీజేపీ
- ఎములాడ రాజన్న.. మోదీ మనసు మార్చు
- చంద్రుడిని చుట్టొద్దాం.. దరఖాస్తు చేసుకోండి
- శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
- తప్పుకున్న నీరా టండన్.. బైడెన్కు చుక్కెదురు
- దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
- అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది దుర్మరణం
- శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం
- 9 నుంచి ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి ఉత్సవాలు
MOST READ
TRENDING