రైతు సమస్యలపై పోరాటం

‘రైతుకు మన అవసరం లేకపోయినా...రైతు అవసరం మాత్రం సమాజానికి ఉంటుంది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాల్ని చూపిస్తూ చక్కటి సందేశంతో దర్శకుడు సముద్ర ఈ సినిమాను తెరకెక్కించారు’ అని అన్నారు నటుడు సునీల్. శ్రీకాంత్, సునీల్, శ్రీకార్తికేయ, అభిరామ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జైసేన’. వి.సాయి అరుణ్కుమార్ నిర్మాత. వి.సముద్ర దర్శకుడు. ఈ నెల 29న విడుదలకానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రతిబింబించే చిత్రమిది. రైతులకు అండగా నిలవడం అందరి బాధ్యత అని చాటిచెబుతుంది. ఇందులో సునీల్ పోలీస్ ఆఫీసర్గా నటించారు. శ్రీకాంత్, తారకరత్న పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’ అని అన్నారు. ఇలాంటి సామాజిక ఇతివృత్తాల్లో నటించే అవకాశం అరుదుగా లభిస్తుందని, మంచి ఆశయంతో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని సునీల్ అన్నారు.
తాజావార్తలు
- ' ఉప్పెన' మేకింగ్ వీడియో చూడాల్సిందే
- మతిస్థిమితం లేని వ్యక్తిని.. కుటుంబంతో కలిపిన ఒక పదం
- రికార్డులు బ్రేక్ చేసిన అశ్విన్
- నవభారత నిర్మాణంలో యువత భాగం కావాలి: వెంకయ్య పిలుపు
- వీడియో : జపాన్ కేబినెట్ లో వింత శాఖ
- ‘మూడ్’మారుతోందా!: వచ్చే ఏడు 13.7 శాతం వృద్ధి !!
- సూరత్లో బీజేపీ కన్నా ఆప్కు ఎక్కువ ఓట్లు
- నూతన ఐటీ నిబంధనలు అమలైతే వాట్సాప్కు చిక్కులే!
- ఇంగ్లాండ్ 81 ఆలౌట్.. భారత్ టార్గెట్ 49
- కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్