ముంబై: ప్రముఖ బాలీవుడ్ నేపథ్య గాయని జగ్జీత్ కౌర్ (93) అనారోగ్య కారణాలవల్ల ఆదివారం ముంబైలో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఆస్పత్రితో చికిత్స పొందుతున్న ఆమె ఈరోజు ఉదయం మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ముంబైలోని ఎస్విరోడ్లోని వైల్పర్లేలో ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించినట్లు చెప్పారు. జగ్జీత్ కౌర్, బజార్ సినిమాలో దేఖ్లో ఆజ్ కా హుమ్కో, షోలా అవుల్ శబ్నం సినిమాలోని ఆఖేమిలనా.. పాటలకు స్వరం అందించారు.
కౌర్భర్త.. మహమ్మద్ ఖయ్యం ప్రముఖ మ్యూజిక్ కంపోసర్. ఆయన 1954లో జగ్జీత్ను వివాహం చేసుకున్నారు. ఖయ్యం.. త్రిషుల్, నూరీ, శోలా అవుల్ శబ్నంలకు కంపోసింగ్ చేశారు. ఆయన ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్తో 2019లో మరణించారు.