నూతన నటీనటులతో చక్రాస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘జగదానంద కారక’ గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది. రామ్ భీమన దర్శకుడు. వెంకటరత్నం నిర్మాత. ఈ చిత్రం ద్వారా వినీత్చంద్ర, అని షిండే నాయకానాయికలుగా పరిచయమవుతున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు బాబి క్లాప్కొట్టారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘దర్శకుడిగా మూడో సినిమా ఇది. చక్కటి కుటుంబ కథతో తెరకెక్కించబోతున్నాం’ అన్నారు. జూలై 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని, కడియం, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతామని నిర్మాత
తెలిపారు.