కరోనా మహమ్మారి సృష్తిస్తున్న విలయంతో చాలా మంది జీవితాలు దుర్భరంగా మారాయి. కొందరు పొట్టచేతిన పట్టుకొని అన్నమో రామచంద్రా అంటున్నారు. మరి కొందరి పరిస్థితి దిక్కుతోచని విధంగా ఉంది. ఇలాంటి పరిస్థితులలో ప్రజలు బాధలను గుర్తిస్తున్న సెలబ్రిటీలు తమ వంతు సాయం అందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి సన్నీ లియోన్ – పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా)తో కలిసి కొవిడ్ బాధితులను ఆదుకోవటానికి ముందుకు వచ్చారు. ఢిల్లోలో ఉండే వలస కార్మికులకు పదివేల భోజనాలను ఉచితంగా అందిస్తామని అన్నారు. సంక్షోభం సమయంలో అందరం కలిసికట్టుగా రావాలి. ముంబైలో వ్యాక్సిన్ వేయించుకున్న 102 ఏళ్ల షీలా తారకేశ్వర్ సిన్హా నాకు ఇన్స్పిరేషన్’’ అంటూ సన్నీ తన పోస్ట్లో పేర్కొంది.
ఇక శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా తన వంతు సాయం అందించింది. ముంబైలో ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజల ఆకలి తీర్చింది.ఇలాంటి సమయంలో నేను ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు గర్వంగా ఉందని జాక్వెలిన్ పేర్కొంది. గత ఏడాది కరోనా టైంలోను సల్మాన్తో కలిసి పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది జాక్వెలిన్.