అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్కి సక్సెస్ అనేది అందని ద్రాక్షగా మారింది. ఎన్ని సినిమాలు చేస్తున్న మంచి సక్సెస్ రావడం లేదు. ఈ మధ్య వచ్చిన అల వైకుంఠపురంలో సినిమాలో సుశాంత్ సెకండ్ హీరోగా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు సోలో హీరోగా ”ఇచ్చట వాహనములు నిలుపరాదు” అనే సినిమాతో ప్రేక్షకుల మందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు సుశాంత్.
ఎస్. దర్శన్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేయగా, చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పోస్టర్లు. సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ సినిమా కథ ఒక బైక్ చుట్టూ తిరుగుతుందని పోస్టర్స్, టైటిల్ చేస్తే అర్ధమవుతుంది. ఆగస్టు 27న చిత్రాన్ని విడుదల చేయనుండగా, తాజాగా మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్ ఆకట్టుకుంటుంది. మంచి థ్రిల్లర్ కాన్సెప్ట్ అని తెలుస్తుంది. ‘చి.ల.సౌ’ లాంటి హిట్ తరువాత సోలో హీరోగా ఈ సినిమా చేస్తోన్న సుశాంత్ కి మళ్లీ హిట్ ఇస్తుందని నెటిజన్స్ అంటున్నారు.ఇటీవల ‘బండి తియ్’ అనే ప్రమోషనల్ సాంగ్ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ పాటను అక్కినేని నాగచైతన్య సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఆ సాంగ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వెంకట్, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఎఐ స్టూడియోస్, శాస్త్రా మూవీస్ పతాకాలపై రవిశంకర్ శాస్రి, హరీష్ కోయలగుండ్ల సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.