దుబాయ్: ఐసీసీ విమెన్స్ టీ20 ప్లేయర్ ర్యాంకింగ్స్లో భారత ఓపెనర్ షఫాలీ వర్మ మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో సత్తాచాటిన టీనేజర్ షఫాలీ రేటింగ్ పాయింట్లను మెరుగుపరచుకొని నంబర్వన్ ర్యాంకు చేరుకుంది. గతేడాది టీ20 వరల్డ్కప్లో నాకౌట్ చేరడంలో కీలకపాత్ర పోషించిన 17ఏండ్ల షఫాలీ తొలిసారి టాప్ ర్యాంకు అందుకుంది.
బ్యాటర్ల ర్యాంకింగ్స్లో భారత్ నుంచి స్మృతి మంధాన ఏడో స్థానంలో ఉండగా..జెమీమా రోడ్రిగ్స్ తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. విమెన్స్ బౌలర్ల ర్యాంకింగ్స్లో దీప్తి శర్మ, రాధా యాదవ్ వరుసగా ఏడు, ఎనిమిదో స్థానంలో నిలిచారు. 15 ఏండ్ల వయసులో భారత్ తరఫున అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడిన అతి పిన్న వయస్కురాలిగా ఆమె రికార్డు సృష్టించింది. ఆమె 15 సంవత్సరాల 239 రోజుల వయస్సులో ఈ ఘనతను సాధించింది.