చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 171 మంది అభ్యర్థులతో రెండో జాబితాను ఏఐఏడీఎంకే బుధవారం విడుదల చేసింది. సీఎం ఈకే పళనిస్వామితో సహా ఆరుగురు అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ ఇటీవల తొలి జాబితాలో పేర్కొంది. దీంతో తాజా జాబితా విడుదలతో అన్నాడీఎంకే మొత్తం 177 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.
మరోవైపు బీజేపీతో పొట్టుపెట్టుకున్న అన్నాడీఎంకే కమలం పార్టీకి 20 సీట్లు కేటాయించింది. నటుడి నుంచి రాజకీయ నేతగా మారిన విజయకాంత్ పార్టీ డీఎండీకే అధికార కూటమి నుండి వైదొలిగింది. దీంతో మరో భాగస్వామ్య పార్టీ అయిన పీఎంకేకు 23 సీట్లు దక్కాయి. ఇంకా 14 సీట్లను పంచుకోవాల్సి ఉన్నది.
234 స్థానాల తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఒకే విడుతలో పోలింగ్ జరుగనున్నది.