కరోనా దెబ్బకు సినిమాల విడుదల తేదీలు అన్నీ మారిపోయాయి. ఏకంగా మార్చ్ నుంచి మొదలు పెట్టి వచ్చే ఏడాది సంక్రాంతి వరకు సినిమాలను విడుదల చేయాలని ముందుగానే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసారు నిర్మాతలు. కానీ వాళ్ల ఆశలన్నీ కరోనా వచ్చి అడియాశలు చేసింది. పాపం చాలా మంది నిర్మాతలు అయితే తమ సినిమాలను ఎప్పుడు విడుదల చేసుకోవాలో కూడా తెలియని సందిగ్ధ పరిస్థితుల్లో పడిపోయారు. ఇప్పటికీ కొందరు మాత్రం తాము ముందు అనౌన్స్ చేసిన తేదీకే వస్తామంటున్నారు. అందులో రాజమౌళి ట్రిపుల్ ఆర్ కూడా ఉంది. ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుందని ఇది వరకే ప్రకటించారు దర్శక నిర్మాతలు. అయితే మధ్యలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలా రోజుల పాటు సినిమా వర్క్ ఆగిపోయింది.
కానీ ఇప్పటికీ సినిమా అదే తేదీన వస్తుందని చెప్తున్నారు మేకర్స్. అది ఎంతవరకు సాధ్యమవుతుందనే విషయంపై ఇప్పుడు అభిమానులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ షూటింగ్ పూర్తయింది. కేవలం రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. జులై 10 నుంచి నాన్ స్టాప్ గా ఈ పాటల చిత్రీకరణ జరగనుంది. అలియాభట్, రామ్ చరణ్ పై ఓ పాట చిత్రీకరించనున్నాడు దర్శకుడు రాజమౌళి. ఈ పాటతో పాటు మరో పండగ పాట కూడా బ్యాలెన్స్ ఉందని తెలుస్తుంది. ఈ రెండింటి కోసం దాదాపు 20 రోజులకు పైగానే కేటాయించబోతున్నాడు దర్శక ధీరుడు.
అంటే చూస్తుండగానే ఆగస్ట్ వచ్చేస్తుందన్నమాట. ఆ తర్వాత సెప్టెంబర్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కే సరిపోతుంది. అప్పటికే అక్టోబర్ వచ్చేస్తుంది. అంటే ఈ మూడు నెలలు పూర్తిగా ఫుల్ బిజీ అయిపోతారు ట్రిపుల్ ఆర్ మేకర్స్. ఒక్క క్షణం కూడా ఆపకుండా పగలు రాత్రి కష్టపడితే కానీ ఈ చిత్రం అనుకున్న సమయానికి విడుదల కావడం కష్టమే. అయినా కూడా నమ్మకంగా విడుదల చేస్తామని అనౌన్స్ చేసారు. కీరవాణి బర్త్ డే పోస్టర్ తో పాటు మొన్నొచ్చిన పోస్టర్ లోనూ అక్టోబర్ 13 అంటూ రాసుకొచ్చారు. మరి నిజంగానే ఆ రోజు ట్రిపుల్ ఆర్ వస్తుందా లేదా అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి..
ఇంట్రెస్టింగ్ గా నందమూరి హీరో ప్రీ లుక్
ఆర్ఆర్ఆర్ నిర్మాతతో నాగచైతన్య సినిమా..!
కొత్తింట్లోకి ‘రాఖీభాయ్’..ఫొటోలు వైరల్
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్