ముంబై: మహారాష్ట్రకు చెందిన ప్రముఖ సినీ దర్శకురాలు, నిర్మాత సుమిత్రా భవే (78) కన్నుమూశారు. మరాఠీ సినిమా పరిశ్రమ ముఖ చిత్రాన్నే మార్చేసిన ఆమె గత కొంతకాలంగా వృద్దాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల అస్వస్థతకు గురికావడంతో పుణెలోని ఓ ప్రైవేటు ఆస్పతిలో చేరిన సుమిత్రా భవే చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు.
సునీల్ సుక్తాంకర్తో కలిసి పనిచేసిన సుమిత్ర తనదైన శైలితో మరాఠీ సినీ పరిశ్రమను కొత్త దారిలో నడిపించారు. వాళ్లిద్దరి కలయికలో దాదాపు 50కి పైగా లఘు చిత్రాలు, నాలుగు టీవీ సీరియళ్లు, 17 సినిమాలు వచ్చాయి. వీటన్నింటికీ సుమిత్రా భవే రచయితగా పని చేశారు. సినీ పరిశ్రమకు అందించిన సేవలకుగానూ వారికి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
దేశంలో కరోనా కరాళ నృత్యం.. 24 గంటల్లో భారీగా కొత్త కేసులు
ప్రముఖ రచయిత వెంకటసుబ్బయ్య కన్నుమూత
రాష్ట్రంలో కొత్తగా 4009 కరోనా కేసులు
కరోనాతో విద్యాశాఖ మాజీ మంత్రి కన్నుమూత
నల్లగొండలో దారుణం.. ఆరుబయట నిద్రిస్తున్న దంపతుల హత్య