పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన ఏ సినిమాకు డేట్స్ ఇస్తున్నాడో కూడా అభిమానులకు అర్థం కావడం లేదు. మరోవైపు నిర్మాతల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కొన్ని రోజుల పాటు వాయిదా వేశారు దర్శక నిర్మాతలు. ఈ మధ్య మళ్లీ మొదలు పెట్టారు. అయితే దీంతో పాటు మరో రెండు సినిమాలకు డేట్స్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. అందులో ఒకటి సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయింది. అయితే ఈ సినిమాను మళ్లీ రీషూట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా నుంచి ఈ మధ్య సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ల కొన్ని కారణాలతో తప్పుకున్నాడు. ఆయన వెళ్లిపోయిన తర్వాత చిత్రీకరించిన సన్నివేశాలు చూసిన పవన్ కళ్యాణ్ సినిమా టెంపో సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అందుకే మొదటి నుంచి మళ్లీ రీ షూట్ చేయాల్సిందిగా కోరినట్లు ప్రచారం జరుగుతుంది. తప్పుకున్న ప్రసాద్ మూరెళ్ల స్థానంలో రవి కె చంద్రన్ వచ్చి చేరాడు. ఈ సినిమాకు సంచలన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే రాస్తుండటం విశేషం. ఆయన దర్శకుడు అయిన తర్వాత ఇతర సినిమాలకు కథలు రాయడం పూర్తిగా తగ్గించేశాడు. కేవలం పవన్ కళ్యాణ్ కోసం తీన్ మార్ సినిమాకు మాటలు రాసిన త్రివిక్రమ్.. మధ్యలో నితిన్ చల్ మోహన రంగా కోసం కథ రాశాడు. మళ్లీ ఇన్నేళ్లకు తన స్నేహితుడు పవన్ కళ్యాణ్ కోసం ఇతర దర్శకుడి సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. త్వరలోనే మళ్లీ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే వచ్చే ఏడాది సంక్రాంతి వరకు విడుదల అయ్యేలా కనిపించడం లేదు. ఇందులో రానా మరో హీరోగా నటిస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Tollywood : అందరి దృష్టి టాలీవుడ్పైనే.. ఒక ఛాన్స్ అంటున్న ఇతర భాషల హీరోలు
రాజమౌళి చదివింది ఇంటరే.. మరి త్రివిక్రమ్, క్రిష్, సుకుమార్ ఏం చదివారో తెలుసా?
సీక్రెట్ ఏజెంట్స్గా మారిపోతున్న టాలీవుడ్ హీరోలు
రేపటి నుంచే తెలంగాణలో సినిమా థియేటర్లు ఓపెన్
తెలుగులో వచ్చిన తొలి డబ్బింగ్ సినిమా ఏంటో తెలుసా?
కరోనా ఎఫెక్ట్.. వచ్చే సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలో!
MAA Elections : మా ఎన్నికలపై వెంకటేశ్ మనసులో మాట ఇదే