న్యూఢిల్లీ: భారత హాకీ గ్రేట్ మేజర్ ధ్యాన్చంద్పై ఓ డాక్యుమెంటరీ రూపుదిద్దుకోనుంది. దిగ్గజం ధ్యాన్చంద్కు భారతరత్న ఇవ్వాలని డిజిటల్ ఉద్యమం చేస్తున్న ప్రొడ్యూసర్ జొయీత రాయ్, ప్రతీక్ కుమార్ మిశ్రా ఈ డాక్యుమెంటరీ రూపకల్పనకు సిద్ధమయ్యారు. జీవితం తొలినాళ్లలో హాకీ దిగ్గజం పడిన కష్టాలు, ఇబ్బందులే ప్రధాన నేపథ్యంగా ఈ డాక్యుడ్రామా ఉండనుంది. ఈ విషయంపై ధ్యాన్చంద్ కుమారుడు అశోక్తో మాట్లాడామని, ఝాన్సీ, అలహాబాద్లో గతేడాదే చిత్రీకరణ జరుపాలని అనుకున్నా కరోనా కారణంగా ఆలస్యమైందని నిర్మాతలు చెప్పారు.