మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, విజనరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో క్రేజీ ప్రాజెక్ట్ రూపొందుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా చిత్రంగా దిల్ రాజు ఈ చిత్రాన్నినిర్మించనుండగా, ఇందులో కియారా కథానాయికగా నటిస్తుంది. అంజలి, జయరామ్, నవీన్ చంద్ర, కామెడీ స్టార్ సునీల్ కూడా సహాయక పాత్రల్లో నటించారు. పొలిటికల్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఆర్సీ 15 సినిమా ఎన్నో అవాంతరాలను దాటుకొని ఈ రోజు పూజా కార్యక్రమాలు జరుపుకుంది. లాంచింగ్ వేడుకకు గెస్ట్లుగా చిరంజీవి, రాజమౌళి, రణ్వీర్ సింగ్ హాజరయ్యారు. మరి కొద్ది రోజులలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుండగా, ఈ సినిమా టైటిల్కి సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
“విశ్వంభర” అనే టైటిల్ని చిత్రానికి పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. విశ్వంభర అంటే అంటే ధరిత్రి, భూమి, నేల అని అర్థం వస్తుందట. టైటిల్ లోనే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసి సినిమాపై అంచనాలు పెంచాలని మేకర్స్ భావిస్తున్నారట. ప్రస్తుతానికి ఆర్సీ 15 పేరుతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇది ఈ బ్యానర్ లో రూపొందుతున్న 50వ ప్రాజెక్ట్ కాగా, పలు భారతీయ భాషలలో పాన్-ఇండియన్ ప్రాజెక్ట్గా తెరకెక్కుతోంది.