నొయిడా: ఉత్తర్ప్రదేశ్లోని నోయిడాలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెక్టార్-63 సమీపంలోని మురికి వాడల్లో భారీ మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని ఇద్దరు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు.
సుమారు 150కి పైగా గుడిసెలు దగ్ధం అయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో బహ్లోల్పూర్ ప్రాంతంలో దట్టమైన పొగలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు.
ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను నోయిడా గౌతమ్ బుద్ద నగర్ పోలిస్ కమిషనర్ ట్విటర్లో షేర్ చేశారు.
‘నోయిడా పోలిస్ స్టేషన్ ఏరియా-3 పరిధిలోని బహ్లోల్పూర్ గ్రామంలో మంటలు చెలరేగాయి. ప్రమాద కారణాలు తెలియాల్సి ఉంది. మంటలు ఆర్పడానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు’ అని ట్వీట్ చేశారు.
నోయిడా ప్రాంత వాసులు కూడా ట్విట్టర్లో మంటల ద్రుశ్యాలతో కూడిన వీడియోలు, మంటలతో వచ్చిన పొగ మబ్బుల వీడియోలను షేర్ చేశారు. ఘటనకకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక్కడికి సమీపంలో ఘజియాబాద్ జిల్లాలో గౌర్ సిటీ సమీపంలో ఆదివారం మరో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఆ ప్రాంతాన్ని పొగ మబ్బు కమ్మేసింది. ఆందోళనకు గురైన ప్రజల అరుపులు, కేకలతో ఈ ప్రాంతం దద్ధరిల్లింది. ఘటన సమాచారాన్ని సంబంధిత అధికారులు తెలిపి అప్రమత్తం చేశారు.
స్థానిక పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే పనిలో పడ్డారు. ఈ అగ్ని ప్రమాదంలో జరిగిన నష్టానికి సంబంధించి అధికారిక ప్రకటనేదీ వెలువడలేదు.
బెంగాల్లో కేంద్ర హోంమంత్రి పర్యటన