దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన 151వ సినిమాగా సైరా చిత్రం చేసిన చిరు ఇప్పుడు కొరటాల శివతో కలిసి ఆచార్య చేస్తున్నాడు. ఈ సినిమా మే 13న విడుదల కావలసి ఉన్నప్పటికీ కరోనా వలన వాయిదా పడింది. లాక్డౌన్ తర్వాత చిరంజీవి మలయాళ రీమేక్ మొదలు పెట్టనున్నాడు. ఈ రీమేక్ సినిమాకు తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించాడు చిరు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి చేసినట్లు తెలుస్తుంది.
త్వరలోనే లూసిఫర్ మూవీ షూటింగ్ మొదలు కానుండగా, ఇందులో చిరు డిమాండ్ మేరకు హీరోయిన్ క్యారెక్టర్ డిజైన్ చేశాడట దర్శకుడు. నిజానికి ఒరిజినల్ లూసిఫర్ లో హీరోయిన్ లేదు. మెగాస్టార్ చిరు డిమాండ్ మేరకు హీరోయిన్ క్యారెక్టర్ డిజైన్ చేసాడట డైరెక్టర్. ఇదిలా ఉండగా.. ఈ సినిమా టైటిల్ గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం లూసిఫర్ సినిమాకు ‘కింగ్ మేకర్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంత ఉందనేది రానున్నరోజులలో తెలియనుంది.